ఇద్దరమ్మాయిల ప్రేమ!

24 Nov, 2015 03:52 IST|Sakshi
ఇద్దరమ్మాయిల ప్రేమ!

శ్రీరాజన్, ప్రశాంతి, గీతాంజలి ప్రధాన పాత్రల్లో భీమవరం టాకీస్ పతాకంపై శ్రీ రాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘ఎఫైర్’  చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ శ్రీ రాజన్ మొత్తం తానై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇద్దరమ్మాయిల ప్రేమకు ఎవరు అడ్డుపడ్డారు? చివరికి ఏమైంది అన్నదే కథ. ఇప్పటి వరకూ నేను రిలీజ్ డేట్ ప్రకటించి సినిమాను పోస్ట్‌పోన్ చేయలేదు.

కానీ మేము అనుకున్న డేట్‌కు ఎక్కువ సినిమాలు రిలీజ్ అవడం వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేశాం. నవంబర్ 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’అన్నారు. ఈ చిత్రానికి శేషు సంగీతం అందించారు.