వారందరికీ నా ధన్యవాదాలు: ఆమిర్‌ ఖాన్‌

11 Apr, 2020 12:31 IST|Sakshi

ముంబై : లాక్‌డౌన్‌ కాలంలో అత్యవసర విభాగాల్లో అవిశ్రాంతంగా సేవలందిస్తున్న వారందరికీ బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్లు, నర్సులు, పోలీస్‌, పారిశుద్ధ్య కార్మికుల సేవలను ఆయన కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం ట్విటర్‌లో ఓ పోస్ట్‌చేశారు. ‘మహారాష్ట్ర పోలీసు, డాక్టర్లు, పరిపాలనా విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది, మహారాష్ట్ర పారిశుద్ధ్య కార్మికులు, నర్సులు, హాస్పిటల్‌ సిబ్బందితో పాటు దేశ వ్యాప్తంగా అన్ని అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు.. అని పేర్కొన్నారు. (భారత్‌లో 7447 కేసులు.. 239 మరణాలు)

కాగా కరోనాకు వ్యతిరేకంగా భారత్‌ చేస్తున్న పోరాటంలో ఆమిర్‌ తన వంతు సహాయకంగా పీఎం కేర్స్‌ ఫండ్‌కి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. అయితే ఎంత మొత్తంలో అందించారనేది మాత్రం ఆయన ప్రకటించలేదు. ప్రస్తుతం ఆమిర్‌ ‘లాల్‌ చద్దా’ సినిమా చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌ నిలిపివేయడంతో..  సినిమా కోసం పనిచేస్తున్న రోజువారీ కార్మికులకు ఆమిర్‌ సహాయం అందిస్తున్నారు. (మాటపై నిలబడ్డా.. ఇక మీ వంతు: గంభీర్‌ )

చదవండి : 10 రోజులకే డిశ్చార్జ్‌ అయిన 93 ఏళ్ల వృద్ధురాలు!

నాలుగేళ్లు సినిమాలకు దూరం: ఆమిర్‌

>
మరిన్ని వార్తలు