సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్తో... స్టే హోం అంటూ ఇప్పటికే సినీ తారలు సోషల్ మీడియాలో తామేం చేస్తున్నామో ఫోటోలు షేర్ చేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే లాక్డౌన్లో ఇంటికే పరిమితమై తనకిష్టమైన గిటార్ నేర్చుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక హీరో నాని ...తన కొడుకుతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్న ఫోటోలను షేర్ చేసుకున్నారు. అలాగే హీరో రాంచరణ్ భార్య ఉపాసన తాను పెంచుకుంటున్న డేజీ అనే గుర్రంతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. (మేడమ్.. థ్యాంక్యూ: విద్యాబాలన్)
ఇక యువహీరో నిఖిల్ సిద్ధార్థ్ పోలీసుల కోసం శానిటైజర్లు తయారు చేశాడు. అంతేకాకుండా ఖాళీ సమయంలో వ్యాయమం చేయడంలో మునిగిపోయాడు. అలాగే తన సిక్స్ప్యాక్ బాడీ ఫోటోలను.. నిఖిల్ షేర్ చేశాడు. (వైరస్ భయపడుతుంది!)