హైదరాబాద్ : ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు. అయితే ఆపరేషన్ నిమిత్తమై ఆయనకు బీ నెగిటివ్ రక్తం అవసరం ఉన్నట్టుగా సమాచారం. ఈ విషయాన్ని ఆయన స్నేహితులు ధ్రువీకరించారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.