విలన్ పాత్రలో మాధవన్

8 Oct, 2015 09:45 IST|Sakshi
విలన్ పాత్రలో మాధవన్

ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ అంతా 'తనీ ఒరువన్' రీమేక్ వైపే చూస్తోంది. రామ్చరణ్ 'బ్రూస్ లీ' షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్ పనుల్లో బిబీగా ఉన్నాడు. ఈ సినిమా అక్టోబర్ 16న రిలీజ్ అవుతుండటంతో, చెర్రీ నెక్ట్స్ ప్రాజెక్ట్ మీదే అందరి దృష్టి ఉంది. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ తమిళ సినిమా 'తనీ ఒరువన్' రీమేక్ అన్న విషయం కన్ఫామ్ అయిపోయింది.

అయితే ఈ సినిమాలో నటించే విలన్ పాత్ర కోసం చాలా రోజులుగా వేట కొనసాగుతున్నా  ఇంత వరకు ఫైనల్ కాలేదు. ముందుగా రానా నటిస్తాడని భావించినా 'బాహుబలి 2' షూటింగ్ ఉండటంతో డ్రాప్ అయ్యాడు. తరువాత నాగార్జున తో చేయించాలని అనుకున్నా.. అది కూడా వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం 'సఖీ' ఫేం మాధవన్తో ఈ పాత్ర చేయించాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్.

లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అరవింద్ స్వామి చేసిన పాత్రలో అదే ఇమేజ్ ఉన్న మాధవన్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. 'బ్రూస్ లీ' సినిమా రిలీజ్ రోజున చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ డిటెయిల్స్లో పాటు కాస్టింగ్ కూడా ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.