ఈ ఏడాది ‘మహర్షి’ సినిమాతో పలకరించిన సూపర్స్టార్ మహేష్ బాబు.. మరో ప్రాజెక్ట్కు సిద్దమవుతున్నాడు. మహర్షి మూవీకి డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మంచి జోరు మీద ఉంది. ఇప్పటికే రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది.
అయితే మహేష్ తన 26వ చిత్రం అనిల్రావిపూడితో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సరిరారు నీకెవ్వరూ, రెడ్డి గారి అబ్బాయి టైటిల్స్ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో విజయశాంతి, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మహేష్కు జోడిగా రష్మిక మందాన్నను హీరోయిన్గా తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నేటి అర్దరాత్రికి ఈ రూమర్స్కు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి ఓ అప్డేట్ను చిత్ర నిర్మాతలు మిడ్నైట్కు ప్రకటించనున్నారు. సినిమా టైటిల్ను ప్రకటిస్తారా?, హీరోయిన్, కీ రోల్ప్లే చేయబోతోన్న నటుల పేర్లను రివీల్ చేయనున్నారా? అని అభిమానులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
SUPERSTAR @urstrulyMahesh's SUPERRRRRRRR NEWS...
👌🌟 2️⃣6️⃣ 📢 at 🕛 12AM Tonight!
— BARaju (@baraju_SuperHit) May 30, 2019