ఫ్యామిలీ డ్రామాకు ఓకె చెప్పిన మహేష్‌..!

29 Jul, 2018 11:36 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధి డెహ్రడూన్లో ఓ మేజర్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ను పూర్తి చేశారు. మరో షెడ్యూల్‌ కోసం త్వరలో విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్‌ చేశాడు మహేష్‌.

క్రియేటివ్‌ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో తను తదుపరి చిత్రం చేయబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించేశాడు. అయితే ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనుందని తెలుస్తోంది. గతంలో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న మహేష్ తరువాత బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచాడు. దీంతో సుకుమార్ కాంబినేషన్‌లో చేయబోయే సినిమాపై ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు