అక్టోబర్‌లో అమెరికా

16 Sep, 2018 00:21 IST|Sakshi
మహేశ్‌బాబు

అక్టోబర్‌లో కుటుంబ సమేతంగా అమెరికా ప్రయాణం అవ్వనున్నారు మహేశ్‌బాబు. ఇది హాలిడే ట్రిప్‌ కాదు. వర్క్‌కు సంబంధించిన ట్రిప్‌. మహేశ్‌ లేటెస్ట్‌ సినిమా ‘మహర్షి’ కోసం ఓ కీలక షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్‌ చెసిన సంగతి తెలిసిందే. సినిమా పూర్తయ్యేంతవరకూ యూనిట్‌ అంతా ఫ్యామిలీలా కలిసి మెలిసి ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఫ్యామిలీనే అక్టోబర్‌ ఫస్ట్‌ వీక్‌లో అమెరికా ప్రయాణం అవ్వనున్నారు. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక.

అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ చేశారు. ఈ నెలాఖరున మరో షెడ్యూల్‌ కోసం యూఎస్‌ వెళతారనే వార్త వినిపించింది. తాజా సమాచారం ఏంటంటే ‘మహర్షి’ చిత్రబృందం అక్టోబర్‌ ఫస్ట్‌ వీక్‌లో అమెరికాకు పయనం అవ్వనున్నారు. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను షూట్‌ చేయనున్నారు. దాదాపు 25 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ సాగుతుంది. ఇందులో మహేశ్, ‘అల్లరి’ నరేశ్‌ ఫ్రెండ్స్‌గా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఉగాది స్పెషల్‌గా ఏప్రిల్‌ 5న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: కేయు మోహనన్‌.

మరిన్ని వార్తలు