నా కెరీర్‌లోనే మోస్ట్‌ మెమొరబుల్‌.. హీరో

24 Sep, 2017 19:26 IST|Sakshi

10 రెట్లు అధికంగా గుండె కొట్టుకుంటోంది- ప్రిన్స్‌మహేశ్‌బాబు సహకారంతోనే సులభం అయింది- మురుగదాస్‌

చెన్నై: ఏఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో నటించడం అన్నది నా కెరీర్‌లోనే మోస్ట్‌ మెమొరబుల్‌గా భావిస్తున్నానని సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు పేర్కొన్నారు. స్పైడర్‌ సినిమాతో నేరుగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌వీ. ప్రసాద్‌ నిర్మించిన భారీ ద్విభాషా చిత్రం స్పైడర్‌. ఈ చిత్రానికి  హీరీష్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందించారు. మహేశ్‌బాబు సరసన రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించారు.

ఎస్‌జే. సూర్య, ప్రేమిస్తే నిమా హీరో భరత్‌ విలన్లుగా నటించడం విశేషం. ఈ చిత్రాన్ని తమిళంలో లైకా సంస్థ విడుదల చేయనుంది.  టాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో ఈ సినిమా భారీ అంచనాలు సంతరించకుంది.  స్పైడర్‌ మూవీ  ఈ నెల 27న(సెప్టెంబర్‌) విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ఆదివారం మద్యాహ్నం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

మహేశ్‌బాబు సహకారంతోనే..
చిత్ర దర్శకుడు ఏఆర్‌. మురుగదాస్‌ మాట్లాడుతూ.. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రం చేయడం తనకు పెద్ద సవాల్గా మారిందన్నారు. అలాంటిది హీరో మహేశ్‌బాబు తన పూర్తి సహకారంతో చాలా సులభం చేశారని పేర్కొన్నారు. ఈ సినిమా మరో నాలుగేళ్ల తరువాత కూడా చూసేలా ఉండాలని ఆయన తనతో అన్నారన్నారు. హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఈ సినిమా ద్వారా కోలీవుడ్‌కు రీఎంట్రీ అవుతున్నారని ఆయన అన్నారు.

10 రెట్లు అధికంగా గుండె కొట్టుకుంటోంది..
మహేశ్‌బాబు మాట్లాడుతూ.. స్పైడర్‌ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుందన్నారు. అయితే ఇప్పటి నుంచే తన గుండె 10 రెట్లు అధికంగా కొట్టుకుంటోందని అన్నారు. తమిళంలో చిత్రం చేయాలన్న కోరిక చాలా కాలంగా ఉందని తెలిపారు. దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ కలిసి స్పైడర​ కథ చెప్పడంతో దీన్ని తెలుగుతోపాటు తమిళంలోనూ చేస్తే బాగుంటుందని భావించామని చెప్పారు. మంచి కథ లభిస్తే మళ్లీ తమిళంలో నటిస్తానని మహేశ్‌బాబు అన్నారు. స్పైడర్‌ సినిమా తనకు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని, ఈ చిత్రంలో తాను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందని హీరోయిన్‌ రకుల్ప్రీత్‌సింగ్‌ అన్నారు. స్పైడర్‌ చిత్రం మహేశ్‌బాబు కెరీర్‌లోనే దిబెస్ట్‌ చిత్రంగా నిలిచిపోతుందని నిర్మాత ఎన్‌వీ. ప్రసాద్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు