ఆసక్తికరంగా ‘ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌’ టీజర్‌

4 Mar, 2019 16:08 IST|Sakshi

రానా, త్రివిక్రమ్‌ లాంటి సెలబ్రెటీలతో సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌, ఫస్ట​ లుక్స్‌ రిలీజ్‌ చేయించింది ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌ చిత్రయూనిట్‌. నేడు సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేయించి.. బజ్‌ క్రియేట్‌ చేసింది. చాలాకాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయి కుమార్‌ నటించిన ఈ మూవీ టీజర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మాటల రచయిత అబ్బూరి రవి కీలకపాత్రలో నటిస్తుండగా.. ఎయిర్‌టెల్‌ భామ సాషా ఛెత్రి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని కాశ్మీర్‌ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు కూడా ఈ సినిమాకు అనుకూలంగా ఉన్నాయి. హూ ఈజ్‌ ది గోల్డ్‌ ఫిష్‌ అంటూ ఆసక్తికరంగా మలిచిన ఈ టీజర్‌ అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. మొదటి సారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోన్న అబ్బూరి రవి, సాషా ఛెత్రిలకు ఈ సినిమా విజయాన్ని ఇస్తుందో లేదో చూడాలి. 'వినాయకుడు' ఫేమ్ సాయికిరణ్ అడివి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరిన్ని వార్తలు