వన్స్‌మోర్‌

23 Apr, 2018 00:10 IST|Sakshi

‘రంగస్థలం‘ సూపర్‌ హిట్‌తో మాంచి ఫామ్‌లో ఉన్నారు డైరెక్టర్‌ సుకుమార్‌. ‘భరత్‌ అనే నేను’ సూపర్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు మహేశ్‌ బాబు. వీరిద్దరూ కలిసి మరోసారి సినిమా చేయబోతున్నారు. ‘1 నేనొక్కడినే’ తర్వాత వన్స్‌మోర్‌ ఈ కాంబినేషన్‌ సెట్‌ అయింది. మహేశ్‌ 26వ చిత్రంగా ఈ సినిమా రూపొందనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ ఆదివారం అధికారికంగా ప్రకటించారు.

‘శ్రీమంతుడు’ తర్వాత మహేశ్, ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్‌ మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో రెండోసారి చేస్తుండటం విశేషం. సో.. ఈ హిట్‌ కాంబినేషన్‌ కూడా వన్స్‌మోరే. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మించనున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లి, 2019లో విడుదల కానుంది. ‘1 నేనొక్కడినే’ సినిమాతో ప్రయోగం చేసిన మహేశ్‌–సుక్కు కాంబినేషన్‌ ఈసారి ఎలాంటి సినిమా చేస్తారో? అనే ఆసక్తి ఇటు చిత్రవర్గాల్లో అటు మహేశ్‌ అభిమానులు, ప్రేక్షకుల్లో నెలకొంది.

>
మరిన్ని వార్తలు