మహేష్‌.. తారక్‌... చెర్రీ

28 Jul, 2018 11:03 IST|Sakshi

టాలీవుడ్‌లో గత కొన్నిరోజులుగా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇంతకాలం రిజర్వ్‌డ్‌గా ఉన్న హీరోలు ఒక్కటై పోతున్నారు. మల్టీ స్టారర్లు.. బడా హీరోలు ఒక్కచోట చేరి సందడి చేయటం.. ఒకరి చిత్రాలకు మరొకరు ప్రమోషన్లు చేసుకుంటూ తిరిగి పాత రోజులను గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఈ ముగ్గురు తరచూ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తుండటం చూస్తున్నాం. 

(మేం మేం బాగానే ఉంటాం. మీరూ మీరే బాగుండాలి)

ఆ మధ్య భరత్‌ అనే నేను బహిరంగ సభ ఈవెంట్‌ సందర్భంగా జరిగిన పార్టీలో సందడి చేసిన ఈ ముగ్గురు స్టార్స్‌.. ఇప్పుడు మరోసారి కనులవిందు చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి బర్త్‌ డే పార్టీకి హాజరయి ఫోటోలకు ఫోజులిచ్చారు. దర్శకుడు కొరటాల శివ, నిర్మాత దిల్‌ రాజు, నటి పూజా హెగ్డే తదితర ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు