ఏడాది తర్వాత... వస్తున్నా!

20 Jun, 2014 01:13 IST|Sakshi
ఏడాది తర్వాత... వస్తున్నా!

‘‘సంస్కృతానికి దగ్గరగా ఉంటుంది తెలుగు. అందుకే, తెలుగు అర్థమవుతుంది. కానీ, మాట్లాడలేను. భవిష్యత్తులో డబ్బింగ్ చెప్పే స్థాయిలో తెలుగు నేర్చేసుకుంటా’’ అని ఇషా తల్వార్ చెప్పారు. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ఉత్తరాది భామ నటించిన మలి చిత్రం ‘మైనే ప్యార్ కియా’ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇషా తల్వార్ మాట్లాడుతూ -‘‘దాదాపు ఏడాది తర్వాత తెలుగు తెరపై కనిపించబోతున్నా. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, ఆ సినిమాతో వచ్చిన పేరు నిలబెట్టుకోవాలంటే మళ్లీ మంచి సినిమానే చేయాలనుకున్నా. ‘మైనే ప్యార్ కియా’ నా పేరుని రెట్టింపు చేస్తుంది’’ అని చెప్పారు.