ఆది సాయికుమార్ హీరోగా పాన్ ఇండియా చిత్రం

10 Jul, 2020 19:02 IST|Sakshi

బాహుబ‌లితో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్ర‌పంచానికి తెలిసింది. అప్ప‌టి నుండి మ‌న టాలీవుడ్ హీరోలంద‌రూ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో యువ క‌థానాయ‌కుడు ఆది సాయికుమార్‌ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఒక సిరీస్‌లా చేయడానికి ప్లాన్ చేస్తుండ‌టం విశేషం. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న ఆది సాయికుమార్ ఈ పాన్ ఇండియా చిత్రం త‌న‌కు పెద్ద బ్రేక్ అవుతుంద‌ని భావిస్తున్నారు. (పెళ్లి చేసుకోవాలంటూ ఆ హీరో నన్ను..)

ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్క‌బోతున్న ఈ చిత్రంలో ఫాంట‌సీ ఎలిమెంట్స్‌, వీఎఫ్‌ఎక్స్‌లకు ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది. ఎస్వీఆర్‌  ప్రోడ‌క్ష‌న్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యాన‌ర్‌పై డెబ్యూ డైరెక్టర్ బాలవీర్.ఎస్‌‌ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న‌ ఈ చిత్రాన్ని ఎస్‌వీఆర్‌ నిర్మిస్తున్నారు. ఇది వ‌ర‌కు ఆది సాయికుమార్ చేసిన చిత్రాల‌కు భిన్నంగా కామిక్ ట‌చ్‌తో సాగే చిత్ర‌మిది. మేక‌ర్స్ రెండేళ్ల పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌పై దృష్టి పెట్టారు. ప్రేక్షకులంద‌రినీ ఆక‌ట్టుకునేలా ప‌క్కా స్క్రిప్ట్‌ను రూపొందించారు. ఈ పాన్ ఇండియా సిరీస్‌లో చాప్ట‌ర్1 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. (సమంత బ్యూటీ థెరపీ వీడియో)

మరిన్ని వార్తలు