కిరణ్, దివ్య జంటగా కె. నరేంద్రబాబు దర్శకత్వంలో వెంకటేశ. సి నిర్మించిన సినిమా ‘మళ్లీ వచ్చిందా’. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసిన టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, హారర్ థ్రిల్లర్స్కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ‘గంగ, రాజుగారి గది, ఆనందో బ్రహ్మ’ తరహా జానర్లో వస్తోన్న ‘మళ్లీ వచ్చిందా’ కూడా ప్రేక్షకాదరణ పొందుతుంది’’ అన్నారు.
నరేంద్రబాబు మాట్లాడుతూ– ‘‘ఆత్మలు, దెయ్యాలు మనుషుల్ని ఆవహించి, భయపెట్టడం చాలా సినిమాల్లో చూశాం. కానీ, ఒక దెయ్యం ఓ ఫోన్ నుంచి మరో ఫోన్కి వెళుతూ మనుషుల్ని భయపెడితే ఎలా ఉంటుందనేది మా సిన్మాలో చూపించాం. ఈ దెయ్యం స్పెషాలిటీ ఏంటంటే... ఎవరి ఫోన్కైనా వారి వాయిస్ను ‘డెత్ మెసేజ్’ రూపంలో పంపిస్తుంది’’ అన్నారు. త్వరలో పాటల్ని, చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. చిత్రసహ నిర్మాతలు గురురాజ్, జి. శశికాంత్, హీరో కిరణ్, హీరోయిన్ దివ్య, కెమెరామ్యాన్ పూర్ణ .కె తదితరులు పాల్గొన్నారు.