సెకండ్‌ చాన్స్‌!

28 May, 2019 09:54 IST|Sakshi

రవితేజ హీరోగా తెరకెక్కిన నేల టిక్కెట్టు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ మాళవిక శర్మ. తొలి సినిమా డిజాస్టర్‌ కావటంతో ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో సోషల్‌ మీడియాలో టైం పాస్‌ చేస్తున్న మాళవికకు ఇన్ని రోజుల తరువాత సెకండ్‌ చాన్స్‌ వచ్చినట్టుగా తెలుస్తోంది.

చిత్రలహరి సినిమాతో పరవాలేదనిపించుకున్న మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించనున్నారు. తొలి సినిమా ఫ్లాప్ కావటంతో ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నారు మాళవిక. గీతా ఆర్ట్స్‌ 2, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.

మరిన్ని వార్తలు