విజన్-2020 ప్రారంభించిన మమ్ముట్టి

7 Sep, 2014 19:13 IST|Sakshi
విజన్-2020 ప్రారంభించిన మమ్ముట్టి
తిరువనంతపురం: కంటి సంబంధిత కాటరాక్ట్ వ్యాధి లేని కేరళ రాష్ట్రం చూడాలని మలయాళ నటుడు మమ్మూట్టి కలలుకంటున్నారు. అందుకోసం మమ్మూట్టి తన జన్మదినం రోజున విజన్ 2020 ప్రారంభించారు. కోచీలో మమ్ముట్టి 63వ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన విజన్ 2020 కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ పాల్గొన్నారు. కంటి సంబంధి వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని చాందీ హామీ ఇచ్చారు. 
 
మమ్మూట్టి ప్రారంభించి కార్యక్రమానికి నిధులు అందిస్తామని ఆయన చెప్పారు. మమ్ముట్టి జన్మదినం రోజునే తిరు ఓనమ్ కావడం విశేషం. అంతేకాకుండా మమ్ముట్టి నటించిన మున్నారియిప్పు, రాజాధి రాజా చిత్రాలు మంచి టాక్ ను సంపాదించుకున్నాయి.