సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మనసుకి నచ్చింది’

22 Jan, 2018 11:20 IST|Sakshi

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.  ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకొని ‘యు/ఎ’ సర్టిఫికెట్ అందుకొంది. ఫిబ్రవరి 16న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నద్ధమవుతోంది. 

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్రెష్ & రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మనసుకి నచ్చింది తెరకెక్కింది. సెన్సార్ పూర్తయ్యింది, యు/ఎ సర్టిఫికేషన్ సొంతం చేసుకుంది. రాధన్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలుస్తుంది. ప్రేక్షకులకి ఒక మంచి సినిమా చూశామనే భావన కలిగించే చిత్రం మనసుకు నచ్చింది’ అన్నారు.

మరిన్ని వార్తలు