‘ఖండాంతరాలు దాటితే శాస్త్రాలు పలకవురా’

20 Jan, 2018 12:27 IST|Sakshi

మంచు విష్ణు హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మరో కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆచారి అమెరికా యాత్ర. బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. సింగం 3 ఫేం అనూప్ సింగ్ థాకూర్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కీర్తీ చౌదరి, కిట్టులు నిర్మిస్తున్నారు.

ఇప్పటికే సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రిపబ్లిక్‌ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్‌, టీజర్‌తో ఆకట్టుకున్న ఆచారి అమెరికా యాత్ర యూనిట్, తాజాగా ఆసక్తికరమైన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కామెడీ, రొమాన్స్, యాక్షన్ లతో రూపొందించిన ఈ సినిమా మంచు విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిలకు హ్యాట్రిక్ సక్సెస్ అందిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

మరిన్ని వార్తలు