మిస్టరీని ఛేదిస్తూ..

6 Feb, 2020 03:30 IST|Sakshi

అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదిస్తున్నారు మంచు విష్ణు. ఆ ప్రయాణంలోనే లాస్‌ ఏంజెల్స్‌ కూడా వెళ్లారు. మరి తనకి కావాల్సిన సమాచారం దొరికిందా? వేచి చూడాలి. మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం లాస్‌ ఏంజెల్స్‌లో జరుగుతోంది. పది రోజులు సాగే ఈ షెడ్యూల్‌లో విష్ణుపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇండో–హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుందట. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు