మంచు విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర'

14 Mar, 2017 13:52 IST|Sakshi
మంచు విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర'

దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం లాంటి సూపర్ హిట్ చిత్రాల తరువాత మంచు విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిల  కాంబినేషన్లో తెరకెక్కనున్న మూడో చిత్రం ఆచారి అమెరికా యాత్ర. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 19న డా.మోహన్ బాబుగారి పుట్టినరోజు సందర్భంగా ఆచారి అమెరికా యాత్ర సినిమాను తిరుపతిలో ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'దర్శకుడు నాగేశ్వర్రెడ్డి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. మల్లిడి వెంకటకృష్ణ మూర్తి ఈ చిత్రానికి కథను సమకూర్చారు. హిలేరియస్ ఎంటర్ టైనర్గా తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ మేజర్ పార్ట్ అమెరికాలో జరగనుంది. మంచు విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ మరోసారి అలరిస్తుంది. మార్చి 19న లాంఛనంగా సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతికనిపుణుల ఎంపిక జరుగుతోంది. ప్రారంభోత్సవం రోజున పూర్తి వివరాలు వెల్లడిస్తాం" అని తెలిపారు.