థ్రిల్‌కి గురి చేసే కథ

4 Feb, 2015 23:21 IST|Sakshi
థ్రిల్‌కి గురి చేసే కథ

నిషా కొఠారి, అఖిల్ కార్తీక్ ముఖ్య తారలుగా పి. శ్రీనివాసరావు, సీహెచ్‌వీ శర్మ నిర్మిస్తున్న చిత్రం ‘క్రిమినల్స్’. ‘మంత్ర’, ‘మంగళ’ చిత్రాల దర్శకుడు ఓషో తులసీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే కథ ఇది. ‘మంత్ర’ ఆనంద్ స్వరపరచిన పాటలు ప్రధాన ఆకర్షణ అవుతాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: కె.వి. సుబ్బారావు, కె. నాగశేఖర్.