మరాఠీ నటి నయనతార కన్నుమూత

1 Dec, 2014 23:08 IST|Sakshi

ముంబై: అలనాటి మరాఠీ సినీ నటి నయనతార(64) అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆమె ఠాణలో నివాసముంటున్నారు. కొంత కాలంగా మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. ఆదివారం ఆస్వస్థతకు గురికావడంతో ఆమెను ముంబైలోని నాయర్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

నాటక రంగం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించిన నయనతార 'బాళా గావు కషి అంగాయి', 'అశి హీ బన్వా బన్వీ', 'ధాంగడ్‌ధింగా' తదితర ప్రముఖ మరాఠీ చిత్రాలలో ఆమె నటించారు.
**