సమాజానికి సందేశం

5 Oct, 2016 23:10 IST|Sakshi
సమాజానికి సందేశం

‘ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని అరికట్టాలంటే ఏం చేయాలి?’ అనే సందేశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘మరో దృశ్యం’. గౌతమ్, శ్వేత జంటగా కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఆర్‌ఎమ్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘‘సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేసేలా ప్లాన్ చేశాం’’ అని దర్శకుడు అన్నారు.  ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: కట్ల రాజేంద్రప్రసాద్.