కాంబినేషన్‌ కుదిరింది

1 May, 2019 00:04 IST|Sakshi

యూత్‌ఫుల్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌ సినిమాలు చేస్తూ ఆడియన్స్‌కు మరింత చేరువ అవుతున్నారు హీరో సాయిధరమ్‌ తేజ్‌. డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో మంచి వినోదాత్మక సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంటారు దర్శకుడు మారుతి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా కుదిరింది.

గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మించనున్నాయని తెలిసింది. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌లో ప్రారంభం కానుంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమా యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే రూపొందిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు