మారుతికే ఓటేసిన వెంకీ

31 Oct, 2015 13:59 IST|Sakshi
మారుతికే ఓటేసిన వెంకీ

గోపాల గోపాల సినిమా తరువాత 10 నెలలకు పైగా గ్యాప్ తీసుకున్నసీనియర్ హీరో వెంకటేష్ త్వరలోనే తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. యంగ్ హీరోల హవా బాగా నడుస్తుండటంతో ఏ తరహా కథతో ఆడియన్స్ ముందుకు రావాలో తేల్చుకోలేక చాలా రోజులుగా కథా చర్చలతోనే కాలం గడుపుతున్నాడు వెంకీ. గతంలో మారుతి దర్శకత్వంలో రాధ పేరుతో ఓ సినిమా చేస్తాడంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రాలేదు.

ఆ తరువాత మరికొంత మంది దర్శకులు వెంకటేష్కు కథలు వినిపించినా అవేవి సంతృప్తినివ్వకపోవటంతో చాలా రోజులుగా ఖాళీగానే ఉంటున్నాడు. ఇటీవలే భలే భలే మగాడివోయ్ సినిమా సక్సెస్తో మంచి జోష్లో ఉన్న మారుతి తాజాగా మరో కథతో వెంకటేష్ను సంప్రదించి మెప్పించాడట. ప్రస్తుతం ఆ కథకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు మారుతి. డిసెంబర్ నెలాఖరుకల్లా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు వెంకీ.

ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించే అవకాశం ఉందంటున్నారు చిత్రయూనిట్. ఇటీవల కోలీవుడ్లో వరుస హిట్స్తో దూసుకుపోతున్న నయనతార గతంలో వెంకటేష్ సరసన తులసి లాంటి హిట్ సినిమాలో నటించింది. మరోసారి ఇదే కాంబినేషన్ రిపీట్ అయితే బిజినెస్ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.