ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీతదర్శకుడు. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు తొలి లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘‘ఇటీవల రామ్చరణ్ విడుదల చేసిన మా చిత్రం టీజర్కు మంచి స్పందన వస్తోంది. వినోద ప్రధానంగా సాగే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్ రావు,