ఆ రాత్రి ఏం జరిగింది?

20 Jul, 2017 00:52 IST|Sakshi
ఆ రాత్రి ఏం జరిగింది?

దిలీప్, ఈషా జంటగా తెరకెక్కిన చిత్రం ‘మాయామాల్‌’. గోవింద్‌ దర్శకత్వంలో హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. సాయికార్తీక్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను హీరో నారా రోహిత్‌ రిలీజ్‌ చేశారు. ‘‘ఒక రాత్రి మొత్తం జరిగే హారర్‌ కామెడీ చిత్రమిది. ఆ రాత్రి ఏం జరిగింది? అన్నది ఆసక్తికరం.

నా మిత్రుడు సాయికార్తీక్‌ వల్లే ఈ సినిమా చేయగలిగా. సాయికార్తీక్, జీవన్‌ కుమార్‌ల ప్రోత్సాహంతో రిలీజ్‌ వరకూ వచ్చాం’’ అన్నారు హరికృష్ణ. ‘‘సినిమా బాగా వచ్చింది’’ అన్నారు గోపాల్‌. ‘‘హైదరాబాద్‌లోని ప్రతి మాల్‌లో నైట్‌ షూట్‌ చేశాం. అవుట్‌పుట్‌  బాగా వచ్చింది’’ అన్నారు దిలీప్‌.