సినిమా సంఘటనలతో బజార్‌

3 Oct, 2019 00:18 IST|Sakshi
మధుసూదన్, రానా సునీల్, శ్రీజిత

‘‘మీనా బజార్‌’ సినిమా టీజర్‌ బాగుంది. సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ ‘మీనా బజార్‌’ సినిమా మంచి విజయం సాధించి, రెండో భాగం కూడా రావాలని కోరుకుంటున్నా’’ అని సి.కళ్యాణ్‌ అన్నారు. మధుసూదన్, శ్రీజిత ఘోష్‌ జంటగా రానా సునీల్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య.మీనాబజార్‌’. ఈ సినిమా ఫస్ట్‌ లుక్, టీజర్‌ని సి. కల్యాణ్‌ విడుదల చేశారు. ‘‘కన్నడలో ఒక సినిమా చేశాను. తెలుగులో మొదటి చిత్రమిది’’ అన్నారు రానా సునీల్‌ కుమార్‌ సింగ్‌. ‘‘మన చుట్టూ జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు’’అన్నారు మధుసూదన్‌.

మరిన్ని వార్తలు