మార్చి 3న 'మెట్రో' రిలీజ్

11 Feb, 2017 15:01 IST|Sakshi
మార్చి 3న 'మెట్రో' రిలీజ్

ప్రేమిస్తే, జ‌ర్నీ, పిజ్జా లాంటి బ్లాక్‌బ‌స్టర్ లను అందించిన‌ ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై తెర‌కెక్కిన సినిమా 'మెట్రో'.  ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న దొంగతనాలు దోపిల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవ‌లే రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కు, స్టిల్స్కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్రముఖ గాయని గీతామాధురి అతిథి పాత్రలో నటిస్తుండటం సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది.

గౌతమ్ మీనన్, ఏ.ఆర్.మురుగదాస్ లాంటి దర్శకులు చిత్ర టైలర్ను చూసి యూనిట్ సభ్యులను అభినందించారు. అన్ని ప్రముఖ నగరాలు ఎదుర్కొంటున్న సమస్య నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావటంతో తెలుగులో నేటివిటి సమస్య కూడా ఉండదన్న నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్.

శిరీష్, బాబీ సింహా, నిశాంత్ ప్రదాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకు ఆనంద కృష్ణన్ దర్శకుడు. తమిళ నాట 2016 జూన్లో రిలీజ్ అయి మంచి విజయం సాధించిన ఈ సినిమాను సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.మార్చి 3న రిలీజ్కు రెడీ అవుతున్న మెట్రో, ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోమరో సక్సెస్ ఫుల్ చిత్రమవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

>