స్పెషల్‌ గెస్ట్‌

9 Jul, 2018 01:27 IST|Sakshi
కూతురుతో షాహిద్‌ కపూర్‌

షాహిద్‌ కపూర్‌ హీరోగా నటిస్తోన్న ‘బట్టీ గుల్‌ మీటర్‌ చాలు’ సినిమా సెట్‌లోకి ఓ స్పెషల్‌ గెస్ట్‌ ఎంటరయ్యారు. ఆ గెస్ట్‌ ఫేమస్‌ హీరోనో లేక డైరెక్టర్‌నో కాదు. షాహిద్‌ ముద్దుల తనయ మిషా కపూర్‌. ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ ఫేమ్‌ శ్రీ నారాయణ్‌సింగ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బట్టీ గుల్‌ మీటర్‌ చాలు’. షాహిద్‌ కపూర్, శ్రద్ధా కపూర్, యామీ గౌతమ్‌లు ముఖ్య తారలుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. షాహిద్, శ్రద్ధాలపై సాంగ్‌ను చిత్రీకరించారు. రీసెంట్‌గా ఈ సెట్‌లోకే స్పెషల్‌ గెస్ట్‌గా వచ్చారు మిషా. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నట్లు ఇంకోమాట.. త్వరలో మీషాకు తోడుగా తమ్ముడు లేక చెల్లి రానున్నారు. అదేనండీ.. ప్రస్తుతం షాహిద్‌ కపూర్‌ వైఫ్‌ మీరా రాజ్‌పుత్‌ ప్రెగ్నెంట్‌ అని చెప్తున్నాం.

మరిన్ని వార్తలు