చివరి చూపు చూడలేదు

25 Apr, 2020 04:34 IST|Sakshi
మిథున్‌ చక్రవర్తి

బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి బసంత్‌ కుమార్‌ చక్రవర్తి (95) ఇటీవలే మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన మనవడు, మిథున్‌ చక్రవర్తి కుమారుడు నిమిష్‌ చక్రవర్తి తెలిపారు. లాక్‌డౌన్‌ ముందు ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం బెంగళూర్‌ వెళ్లిన మిథున్‌ చక్రవర్తి లాక్‌డౌన్‌ కావడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో తండ్రిని చివరిసారిగా చూసే అవకాశం దక్కలేదట. 

మరిన్ని వార్తలు