‘ఈ మూడు రోజులు సంక్రాంతి కన్నా బాగున్నాయి’

29 Feb, 2020 14:26 IST|Sakshi

జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా అశోక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిస్‌’, పూర్తిగా కొత్తవారితో క్రౌడ్‌ ఫండెడ్‌ మూవీగా వస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా మూవీ ట్రైలర్‌ను ‘మహానటి’దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ విడుదల చేశారు. 

యూత్‌కు రిలేట్‌ అయ్యే కంటెంట్‌ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 128 సెకన్ల నిడివి గల ట్రైలర్‌లో.. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, రొమాన్స్‌, మనస్పర్థలు, బ్రేకప్‌ వంటి అంశాలను జోడించారు. అంతేకాకుండా లవ్‌లో ఉన్నప్పుడు ప్రేమజంట మధ్య వచ్చే డైలాగ్‌లు, ఓ మొబైల్‌ మిస్‌ అవడం దాని కోసం అన్వేషించడం, హీరో యాక్షన్‌ సీన్స్‌తో ఓ ఫుల్‌ పవర్‌ ప్యాక్‌ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రీడింగ్‌ ల్యాంప్‌ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యశ్వంత్‌ నాగ్‌ సంగీతమందిస్తున్నాడు. 

చదవండి:
కన్నీటి పర్యంతమైన దర్శకుడు
 
‘మైండ్‌ బ్లాక్‌’ చేసిన మహేష్‌, రష్మిక ఫుల్‌ వీడియో!

మరిన్ని వార్తలు