ఆ కెమిస్ట్రీ మా వారికి నచ్చింది

23 Dec, 2013 23:08 IST|Sakshi
ఆ కెమిస్ట్రీ మా వారికి నచ్చింది
ఒకప్పటి పాపులర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ బాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతున్నారు. పెళ్లి తర్వాత దాదాపుగా సినిమాలకు దూరమైన మాధురీ మళ్లీ ఇప్పుడిప్పుడే అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. ఇటీవల ’యే జవానీ హై దీవానీ’ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్‌తో అదరగొట్టిన మాధురీ తాజాగా ‘దేడ్ ఇష్కియా’చిత్రంలో నటించారు. ఇది పూర్తి వినోదాత్మక చిత్రమని, ఈ సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ కనిపించడం తన భర్త శ్రీరామ్ నేనేకు చాలా సంతోషం కలిగించిందన్నారు. ఆ చిత్రం ప్రోమో, ‘హమారీ ఆతరియా’ పాట శ్రీరామ్‌ను ఆకట్టుకుందని, ముఖ్యంగా నసీరుద్దీన్‌షాతో కెమిస్ట్రీ తన భర్తకు బాగా నచ్చిందని మాధురి తెలిపారు.
 
>