శ్రీమంతుడు, జనతా గ్యారెజ్, రంగస్థలం సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన సంస్థ మైత్రి మూవీ మేకర్స్. బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతున్న మైత్రి మూవీస్ ప్రస్తుతం టాలీవుడ్లో ప్రతిష్టాత్మక సంస్థగా మారింది. వరుస ప్రాజెక్ట్లతో మైత్రీ మూవీస్ బిజీగా ఉంది.
ప్రస్తుతం నాగ చైతన్యతో సవ్యసాచి, రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాల విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది ఈ సంస్థ. సవ్యసాచి సినిమాను నవంబర్ 2న , అమర్ అక్బర్ ఆంటోని మూవీని అక్టోబర్ 5న రిలీజ్ చేయనున్నారు. మహేష్బాబు 26వ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించబోతున్న విషయం తెలిసిందే.
#AAAOnOct5th#SavyasachiOnNov2nd pic.twitter.com/De3obFUydU
— Mythri Movie Makers (@MythriOfficial) August 11, 2018