నఫీసా అలీ భావోద్వేగం

11 Jan, 2019 15:02 IST|Sakshi

‘మూడో కీమోథెరపీ పూర్తయింది. ఇప్పుడే అసలైన యుద్ధం మొదలైంది. తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను త్వరగా కోలుకోవాలంటూ ఇంతమంది కోరుకోవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ మాటలే నాకు ధైర్యాన్ని, బతుకతాననే ఆశను బలంగా రేకెత్తిస్తాయి’ అంటూ బెంగాల్‌ నటి, కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు నఫీసా అలీ(61) ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు ఆమె అభిమానులను ఉద్వేగానికి గురిచేస్తోంది.

తాను ఒవేరియన్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్నానే విషయాన్ని నఫీసా అలీ గతేడాది నవంబరులో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఆమె... ‘ నా విలువైన స్నేహితురాలిని కలుసుకున్నాను. స్టేజ్‌ 3 క్యాన్సర్‌తో బాధపడుతున్న నేను త్వరగా కోలుకోవాలని ఆమె ఆశించారు’ అంటూ క్యాప్షన్‌ జతచేశారు. కాగా బెంగాల్‌లో జన్మించిన నఫీసా ‍ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. ఆమె తాతయ్య వాజిద్‌ అలీ ప్రముఖ రచయిత. ఇక ఆమె మేనత్త జైబ్‌-ఉన్నీసా- హమీదుల్లా స్త్రీవాదిగా గుర్తింపు పొందారు.

Done my 3rd Chemotherapy 10th January ‘19 and now the battle begins ... I am praying to get well .I am so deeply touched by all your wishes and feel blessed reading messages from around the world. Gives me hope and courage.💕🥰

A post shared by nafisa ali sodhi (@nafisaalisodhi) on

A post shared by nafisa ali sodhi (@nafisaalisodhi) on

మరిన్ని వార్తలు