మావయ్య వెంకటేశ్తో సిల్వర్ స్క్రీన్ను షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు హీరో నాగచైతన్య. ఇదివరకు నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’ సినిమాలో వెంకీ గెస్ట్గా కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్లో మేనల్లుడి సినిమాలో నటించనున్నారు. ఈ మామా అల్లుళ్ల కథ జూలైలో మొదలు కానుంది.
రియల్ లైఫ్లో మామా అల్లుళ్లు అయిన వెంకీ, చైతూ ఈ చిత్రంలో కూడా అదే పాత్రల్లో కనిపించనున్నారు. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమాలో నటించడానికి టాప్ హీరోయిన్లను సంప్రదిస్తున్నారట చిత్రబృందం. అందులో సమంత కూడా ఉన్నారని టాక్.