కొత్త కాంబినేషన్‌

15 Dec, 2019 00:30 IST|Sakshi
పరశురామ్‌

‘మజిలీ, వెంకీ మామ’ సినిమాల సక్సెస్‌తో జోష్‌ మీద ఉన్నారు నాగచైతన్య. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. ఇది నాగచైతన్య కెరీర్‌లో 20వ చిత్రం. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్స్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘గీత గోవిందం’ చిత్రం తర్వాత పరశురామ్‌ తెరకెక్కించనున్న చిత్రమిదే. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ సినిమాలో నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని చిత్రబృందం తెలిపింది.

మరిన్ని వార్తలు