దుబాయ్‌ ప్రయాణం

20 Feb, 2020 00:12 IST|Sakshi
నాగచైతన్య, సాయి పల్లవి

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. నారాయణ్‌ దాస్, పి. రామ్మోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ దుబాయ్‌లో జరగనుంది. ఈ నెల 21 నుంచి నెలాఖరు వరకూ దుబాయ్‌లో చిత్రీకరణ జరుపుతారు. ఈ షెడ్యూల్‌లో ఓ పాటను, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట చిత్రబృందం. ఈ సినిమాలో తెలంగాణ కుర్రాడి పాత్రలో కనిపించనున్నారు నాగచైతన్య. వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాకి సంగీతం: పవన్, కెమెరా: విజయ్‌ సి.కుమార్‌.

మరిన్ని వార్తలు