అదే బేనర్లో...

24 May, 2020 05:58 IST|Sakshi
నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, శేఖర్‌ కమ్ముల

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్‌ స్టోరీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శేఖర్‌ కమ్ముల. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ నిర్మిస్తున్నారు. 15 రోజుల చిత్రీకరణ మినహా ఈ సినిమా దాదాపు పూర్తయింది. షూటింగ్స్‌ అనుమతి రాగానే ఆ పార్ట్‌ను పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అయితే శేఖర్‌ కమ్ముల తదుపరి చిత్రం కూడా నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ నిర్మాణంలోనే ఉంటుందని ప్రకటించారు. ‘లవ్‌స్టోరీ’ ప్రయాణం నచ్చడంతో మరో సినిమా కోసం ఈ డైరెక్టర్‌–ప్రొడ్యూసర్‌ కాంబి నేషన్‌ కలిసిందని సమాచారం. ఈ సినిమాలో ఓ స్టార్‌ హీరో నటించనున్నారని కూడా తెలిసింది.

మరిన్ని వార్తలు