మరోసారి హాట్ టాపిక్ అయిన జంట

29 Aug, 2016 19:59 IST|Sakshi
మరోసారి హాట్ టాపిక్ అయిన జంట

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో ఉన్నారని, త్వరలో వీళ్లు వివాహం చేసుకోనున్నారనే వార్త గత కొన్ని రోజులుగా హల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ విషయాన్ని  ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు, అలానే తీవ్రంగా ఖండించనూ లేదు. దీంతో వీళ్ల ప్రేమ నిజమేనంటూ రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకుముందు షాపింగ్ మాల్స్, ఐస్ క్రీమ్ పార్లర్స్ వద్ద కెమెరా కంటికి చిక్కిన ఈ జంట మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూతురి వివాహం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ వివాహానికి అక్కినేని ఫ్యామిలీతో కలిసి సమంత కూడా హాజరవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నాగార్జున, అమల, అఖిల్, చైతన్యలతోపాటు సమంత కూడా ఉండటంతో కెమెరాలు చకచకా క్లిక్మనిపించాయి. అక్కినేని కుటుంబంతో ఉన్న అనుబంధం కొద్దీ ఆమె వారితో కలిసి ఆ పెళ్లికి వెళ్లిందా లేక మరేదైనా కారణం ఉందా అనేది సమంతే చెప్పాలి.

>