నాకొక కొత్త రోజులా ఉంది: నాగ చైతన్య

17 Mar, 2018 09:43 IST|Sakshi

‘ఏంమాయ చేసావె’  చిత్రం ద్వారా ప్రేక్షకుల్ని మెప్పించిన నాగ చైతన్య, సమంత మరోసారి అదే మ్యాజిక్‌ చేయబోతున్నారు. వివాహ బంధంతో ఒకటైన ఈ జంట వివాహానంతరం తొలిసారిగా  ఆన్‌ స్క్రీన్‌పై ఆలపించనున్నారు. ప్రస్తుతం చై-సామ్‌ కొత్త సినిమాలో నటించబోతున్నారు. ఇప్పటికే  ఈ విషయాన్ని నాగ చైతన్య తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ‘సమంతతో కలిసి పనిచేయడం నాకొక కొత్త రోజులా ఉంది... . గుడ్‌మార్నింగ్‌’  అంటూ ఇద్దరు కలిసి దిగిన ఫోటోను ట్వీట్‌ చేశాడు.

శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై  సాహు గరిపాటి, హరీశ్ పెద్ది నిర్మించనున్నారు. పెళ్లికి ముందు వీరి కాంబినేషన్ వచ్చిన ‘ఏమాయ చేశావె’, ‘మనం’  చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. దీంతో  చై-సామ్‌ కలిసి నటించబోయే ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక  సమంత ‘రంగస్థలం’ షూటింగ్ పూర్తి చేసుకొని యూటర్న్‌ పనుల్లో బిజీ కాగా నాగ చైతన్య ‘సవ్యసాచి’ సినిమాను షూటింగ్‌లో పాల‍్గొంటున్నాడు.


 

మరిన్ని వార్తలు