‘మనం’ తర్వాత నాన్న నాగార్జునతో కలసి నాగచైతన్య ‘బంగార్రాజు’ సినిమాలో నటించనున్నారు. ఇది ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్. నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. 2016 సంక్రాంతికి రిలీజైన ఈ సూపర్ మాస్ మూవీ సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కథను సిద్ధం చేశారు కల్యాణ్ కృష్ణ. ఈ సినిమాలో నాగార్జున, నాగచైతన్య తండ్రీ కొడుకుల్లానే నటించనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను థియేటర్స్లోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సమంత కనిపిస్తారని టాక్.