కొందరు నటులు అంతే.. కథ, పాత్ర నచ్చితే చాలు.. అది గెస్ట్ రోలా? మల్టీస్టారరా? అని ఆలోచించరు. నాగార్జున ఈ కోవలోకే వస్తారు. ఓ వైపు సోలో హీరోగా చేస్తూనే మరోవైపు మల్టీస్టారర్ సినిమాలతో ముందుకెళుతున్నారాయన. ‘అధిపతి’, ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించిన ఆయన ‘సీతారామరాజు, స్నేహమంటే ఇదేరా, రాజుగారి గది2’, ఊపిరి’ వంటి మల్టీస్టారర్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నానీతో ఓ మల్టీస్టారర్ చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన నాగార్జున.
ఇది కాకుండా మరో మల్టీస్టారర్ మూవీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా తమిళ హీరో ధనుష్తో కావడం విశేషం. నాగార్జున–కార్తీ నటించిన ‘ఊపి రి’ చిత్రంలో నాగ్ నటన ధనుష్ని కట్టిపడేసిందట. తాను నటిస్తూ, నిర్మించనున్న చిత్రంలో నాగార్జున నటిస్తే బాగుంటుందనుకుంటున్నారట ధనుష్. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ధనుష్.. నాగార్జునను కలిసి సినిమా విషయమై చర్చించారని ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి.. నాగ్–ధనుష్ ప్రాజెక్ట్ ఉంటుందా? వెయిట్ అండ్ సీ.