నా తొలి సినిమా... నాన్న చివరి సినిమా

23 May, 2018 13:16 IST|Sakshi

అక్కినేని కుటుంబానికి మరుపురాని సినిమా ‘మనం’. అక్కినేని మూడు తరాల హీరోలు ఈ సినిమాలో కలిసి నటించారు. పైగా ఏఎన్నార్‌కు ఇది చివరి చిత్రం కావడంతో అక్కినేని కుటుంబానికి ఈ మూవీ ఎంతో ప్రత్యేకం. నేటికి మనం మూవీ రిలిజై నాలుగు సంవత్సరాలైంది. ఈ సందర్భంగా కింగ్‌ నాగ్‌ తన భావాల్ని ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. 

నాన్న నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాం అంటూ ట్వీట్‌ చేసిన నాగ్‌, కొంత సమయం తరువాత.. ‘నా మొదటి సినిమా విక్రమ్‌, మా నాన్న చివరి చిత్రం మనం ఒకే తేదీన (మే 23) విడుదలయ్యాయి. మేము ముందుగా ప్లాన్‌ చేయలేదు. అలా జరిగింది. అంతేకాకుండా ఈ  23ను తిరిగేస్తే 32 వస్తుంది. నేను సినీరంగంలో అడుగుపెట్టి 32 ఏళ్లు అవుతోంది. మా పై ప్రేమను చూపిస్తున్న వారందరికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశారు. 
 

మరిన్ని వార్తలు