నా ప్రేమ నువ్వేనా

12 Mar, 2018 01:53 IST|Sakshi
ఓంకార్, చోటా కె.నాయుడు, రాశీ సైనా, వాస్‌దేవ్‌

వాస్‌దేవ్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘నాలో ప్రేమ నువ్వేనా’. జై చిరంజీవ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా లోగోని సినిమాటోగ్రాఫర్‌ చోటా కె. నాయుడు ఆవిష్కరించి, బెస్ట్‌ విషెష్‌ చెప్పారు. వాసుదేవ్‌ మాట్లాడుతూ –‘‘న్యూ ఏజ్‌ అండ్‌ డిఫరెంట్‌ లవ్‌స్టోరీతో తెరకెక్కిన సినిమా ఇది. త్వరలోనే పాటలను విడుదల చేసి, సమ్మర్‌లో సినిమా రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. రాశీ సైనా, సంజయ్‌ శివలింగమ్, రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌.
 

మరిన్ని వార్తలు