తారకరత్న హీరోగా ద్విభాషా చిత్రం

18 Nov, 2018 11:37 IST|Sakshi

నంద‌మూరి తార‌క‌ర‌త్న‌, మేఘ శ్రీ జంట‌గా చాందిని క్రియేష‌న్స్ ప‌తాకంపై  శివ‌ప్రభు ద‌ర్శక‌త్వంలో నాగ‌రాజు నెక్కంటి తెలుగు, క‌న్నడ భాష‌ల్లో   నిర్మిస్తున్న  చిత్రం ‘అమృత వ‌ర్షిణి’.  ఈ చిత్రం షూటింగ్ ఇటీవల రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి  హీరోలు నారా రోహిత్, శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమాను థ్రిల్లర్‌, లవ్‌, సస్పెన్స్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌ తో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిస్తున్నారు. చిక్‌మంగళూరులో జరగనున్న సింగిల్‌ షెడ్యూల్‌లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని వెల్లడించారు. 20 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళుతున్న ఈసినిమాకు జెస్సీ గిఫ్ట్‌ సంగీతమందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు