పరీక్ష రాశాం.. ఫలితం కోసం నిరీక్షిస్తున్నాం –‘దిల్‌’ రాజు

14 Dec, 2017 00:25 IST|Sakshi

‘‘దర్శకుడు వేణు ఓ మధ్య తరగతి కుర్రాడు. తను ఎంతో కష్టపడి చేసిన సినిమా ‘ఎం.సి.ఎ.’ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి). ఈ నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది. పరీక్షలు రాసి, ఫలితం కోసం వెయిట్‌  చేస్తున్నట్లు యూనిట్‌ అందరం నిరీక్షిస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. నాని, సాయిపల్లవి జంటగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్, లక్ష్మణ్‌ నిర్మించిన చిత్రం ‘ఎం.సి.ఎ.’. ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘నాని ప్రతి సినిమాకు ఏదో ఒక ప్రయోగం చేస్తూ సక్సెస్‌లో ఉన్నాడు. ఈ ఏడాది మా బ్యానర్‌లో వస్తోన్న 6వ సినిమా ఇది. ఈ చిత్రంతో భూమిక రీ–ఎంట్రీ ఇస్తున్నారు. ట్రైలర్‌ విడుదలైన 30 నిమిషాలకే లక్ష వ్యూస్‌ను రాబట్టుకుంది.

ఈ సినిమాతో ప్రేక్షకులని సంతృప్తిపరుస్తాం’’ అన్నారు. ‘‘ఐదేళ్లు ఇంట్లో కూర్చున్న నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నానీకి థ్యాంక్స్‌. మిడిల్‌ క్లాస్‌ అనేది అందరిలో ఉండే మైండ్‌ సెట్‌. అందుకే, సినిమా అందరికీ రీచ్‌ అవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు వేణు శ్రీరామ్‌. ‘‘క్రిస్మస్‌ సీజన్‌లో మా సినిమా కూడా ఉండటం ఆనందంగా ఉంది. ఈ సీజన్‌లో వచ్చే సినిమాలన్నీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తాయి. అన్నింటినీ సక్సెస్‌ చేయాలి’’ అన్నారు నాని. నటుడు రాజీవ్‌ కనకాల పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు