‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఇప్పుడు నానీతో ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఈ మధ్యనే వివేక్ వినిపించిన కథకి నాని గ్రీన్సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ‘వి’ చిత్రాన్ని పూర్తి చేసి, ‘టక్ జగదీష్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు నాని. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమా చేయనున్నారు. ఈ సినిమాలు పూర్తయ్యాక వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేసే సినిమాను ప్రారంభిస్తారని సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశముంది.