సెన్సార్ పూర్తి చేసుకున్న 'మజ్ను'

12 Sep, 2016 18:24 IST|Sakshi
సెన్సార్ పూర్తి చేసుకున్న 'మజ్ను'

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'మజ్ను'  సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్‌ పొందినట్లు సమాచారం. యూత్ఫుల్ ఎంటర్టెయినర్గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన అను ఇమ్మానుయేల్, ప్రియాశ్రీలు కథానాయికలుగా నటించారు.

సెప్టెంబరు 23 వ తేదీన మజ్ను ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ఈ చిత్రానికి విరించి వర్మ దర్శకత్వం వహించగా గోపీసుందర్ సంగీతం అందించారు. వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య తదితరులు ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు.